నెల వయసున్న పసికందుపై యాసిడ్ పోసిన ఘటన రాజస్థాన్లోని సవారు మాధోపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియాంన్ష్ అనే శిశువు న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి ఎంతకు తగ్గట్లేదు. దీంతో తనకు తెలిసిన ఓ మంత్రగత్తె వద్దకు తన బిడ్డను తల్లి తీసుకొని వెళ్లింది. యాసిడ్ పోస్తే న్యూమోనియా తగ్గుతుందని భావించిన ఆ మంత్రగత్తె.. పసికందు ఛాతీపై యాసిడ్ పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన శిశువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంత్రగత్తెను, తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆ మంత్రగత్తె.. చిన్నారులకు సోకిన వ్యాధులను నయం చేస్తుందని భావించి.. ఆమె వద్దకు భారీ సంఖ్యలో పిల్లలను తీసుకువస్తారని పోలీసుల విచారణలో తేలింది.