రైల్వేశాఖ కొత్త యాప్.. సాధారణ రైల్వే టికెట్లూ ఇక ఫోన్లలోనే..!

Update: 2018-06-15 13:00 GMT

ఇప్పటివరకూ రిజర్వేషన్ టికెట్లను మాత్రమే ఆన్ లైన్, స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉండగా, ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేని సాధారణ టికెట్లను విక్రయించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. అన్ రిజర్వ్ డ్ టికెట్ (యూటీఎస్) కొనుగోలును మరింత సులభతరం చేస్తూ, రద్దీ సమయాల్లో వేగంగా టికెట్ ను ఎక్కడినుంచైనా పొందేలా రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం ఈ యాప్ ను తయారు చేసింది. 'యూటీఎస్ ఆన్ మొబైల్' పేరిట ఈ యాప్ అందుబాటులోకి రాగా, నగదును రైల్వే వాలెట్ లో జమ చేసుకుని నెలవారీ టికెట్లు, ఏ రైల్వే స్టేషన్ లోనైనా ప్లాట్ ఫాం టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఏదైనా టికెట్ ను రద్దు చేసుకుంటే, వాలెట్ లోకి జమ అవుతాయి. తొలుత పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలు సమర్పించి యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

Similar News