లోక్‌సభలో రాహుల్ కితకిత

Update: 2018-07-20 09:13 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. లోక్‌సభలో ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడిన రాహుల్.. తన ప్రసంగం ముగిసిన తర్వాత .. మోదీ వద్దకు వెళ్లి ఆయనకు విషెస్ చెప్పారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత మోదీని హగ్ చేసుకున్నారు. రాహుల్ స్టంట్ సభలో ఉన్న సభ్యులందర్నీ షాక్‌కు గురిచేసింది. మీ దృష్టిలో నేను పప్పూనే కావచ్చు, నాపై మీకు చాలా ద్వేషం ఉంది, కానీ నాకు మీ మీద కోపం లేదు అని రాహుల్ గాంధీ అన్నారు. 

Similar News