భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా పీవీ సింధు నిలిచింది. ఈ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. ఘన విజయం సాధించిన పీవీ సింధుపై సర్వత్ర ప్రశంలు వెల్లువెత్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పీవీ సింధు గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం సాధించి సింధు చరిత్ర సృష్టించిందని కెసిఆర్ అన్నారు. సింధు భారత దేశానికే గర్వకారణంగా నిలిచిందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కెసిఆర్ ఆకాంక్షించారు.