రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య యశోదా బెన్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందారు. కోటా-చిత్తోడ్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఆమెను చిత్తోడ్లో ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందనీ... వైద్యులు ఆమెకు చికిత్సి అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.