కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని ఏపీ ప్రజల తరపున కోరుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ప్రజల హక్కు గురించి కేంద్రం అర్థం చేసుకోవడానికి పార్లమెంట్ను మించిన వేదిక లేదని ఆయన చెప్పారు. న్యాయం చేయాలని కోరారు. టీడీపీ నాయకత్వంపై ఉన్న కోపం కారణంగా ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరించి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయొద్దని పవన్ కేంద్రాన్ని కోరారు. టీడీపీ, బీజేపీ ఇన్నాళ్లూ ఏపీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వృథా చేశాయని, ఇకనైనా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల తరపున నిలబడాలని జనసేనాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.