సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ జనసేనలో చేరుతారంటూ వస్తున్న వార్తలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీలోకి వస్తే సాధరంగా స్వాగతం పలుకుతానన్నారు. గతంలో ఒక్కసారి మాత్రమే లక్ష్మి నారాయణను కలిశానన్న పవన్ కళ్యాణ్ ... జనసేన ఆవిర్భావ సభ రోజున లక్ష్మినారాయణ తనకు మెసేజ్ చేశారంటూ తెలియజేశారు.
మహారాష్ట్ర అడిషనల్ డీజీ పదవికి లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన త్వరలో రాజకీయాల్లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం క్లారిటీ లేదు. ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారన్న మరో ప్రచారం కూడా సాగుతోంది. లక్ష్మీనారాయణ బీజేపీలోకి వెళతారని ఒకవైపు.. జనసేనలోకి వెళ్తారని మరోవైపు, ఆయన పవన్కు టచ్లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.