రాష్ట్ర విభజన సమస్యలపై అధ్యయనానికి స్వత్రంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్న లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జేపీ ఏర్పాటుచేయబోయే స్వతంత్ర కమిటీని స్వాగతించారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇతర సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని కోరుతూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.