ఈ ఏడాది అంగరంగ వైభవంగా లాహోర్లోని నాన్కనా సాహిబ్లో 549వ గురునానక్ జయంతికి సర్వంసిద్దం అయిపోయింది. ఉత్సవాల్లో భాగంగా పాకిస్థాన్ సర్కార్ ఒకేసారి 3800 మంది భారతీయులకు వీసాలు జారిచేసింది. సిక్కు యాత్రికులకు అధిక సంఖ్యలో వీసాలు జారీ చేయడం ఇదే మొట్ట మొదటిసారి పాకిస్థాన్ హై కమీషన్ వెల్లడించింది. ప్రతిఏటా లాగానే సిక్కులకు వీసాలు జారీ చేస్తారు కాగా పెద్ద సంఖ్యలో వీసాలు ఇవ్వడం ప్రత్యేకమైందని పాక్ హై కమీషనర్ వెల్లడించారు. పక్కదేశాల్లో ఉన్న సిక్కుల కూడా పాక్ సర్కార్ వీసాలు ఇచ్చింది.