డ్రంకన్ డ్రైవింగ్ ...మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బర్త్డే సందర్భంగా పీకలదాకా తాగిన హెచ్సీయూ విద్యార్ధినీ విద్యార్ధులు..... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై లాంగ్ డ్రైవ్కి వెళ్లారు. దాంతో శంషాబాద్ సమీపంలో కారు అదుపుతప్పింది. డివైడర్ ఢీకొట్టి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విద్యార్ధిని అనన్య మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన యువతి ఉత్తరప్రదేశ్ వాసిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.