ఒడిశా అడవుల్లో మరోసారి అలజడి రేగింది. మల్కన్ గిరి జిల్లా బెజ్జింగ్ వాడ అడవుల్లో పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులింకా కొనసాగుతున్నాయి.