ప్రమాణస్వీకారం చేసిన ఆరురోజులకే సీఎం ఇలా అనేశారేంటి?

Update: 2018-05-28 07:58 GMT

కర్ణాటక 23 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి ఆరురోజులకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నెహ్రు వర్ధంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించిన సీఎం కుమారస్వామి తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా  ఆరున్నర కోట్ల ప్రజల దయతో  ఎన్నికవలేదని కాంగ్రెస్ దయతోనే ఈ స్థానాన్ని అధిష్టించానని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ 38 సీట్లు గెలుచుకోగా బీజేపీ 104 , కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. ఏ పార్టీకి మెజారిటీ రానిపక్షంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు మద్దతు తెలిపింది. దీంతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. 

Similar News