శృంగారానికి నిరాకరించిందని భార్యను గొంతుకోసి చంపేశాడు ఓ భర్త. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన అజయ్ క్షురకుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ఈ క్రమంలో ఏడాది క్రితం అతనికి నోటీ క్యాన్సర్ ఉన్నట్లుగా వైద్యపరీక్షల్లో తేలింది. అప్పటికే క్యాన్సర్ బాగా ముదిరిపోయింది.. ఎంతలా అంటే నోటి దవడకు రంధ్రం పడేంతగా. దీంతో చికిత్స తీసుకుంటూ ఇంటి వద్దే ఉంటున్నాడు అజయ్. దీంతో ఆయన భార్య మమత ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకుని నోయిడాలోని తన సోదరుడి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఈ నెల 11న భార్య వద్దకు వెళ్లిన అజయ్.. శృంగారంలో పాల్గొనాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు.