టీటీడీ వ్యవస్ధాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి అంజలి ఘటించారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మిణి, మనమడు దేవాన్ష్ .. ఎన్టీఆర్ సమాధి దగ్గరకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జోహార్ ఎన్టీఆర్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.