సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లందరికీ చంద్రబాబు లీడర్ అని, చార్లెస్ శోభరాజ్ను మించిన గజదొంగ చంద్రబాబు అని ఆరోపించారు. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాతో తనను పోల్చడాన్ని తప్పుబట్టిన విజయసాయి తాను ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాంకు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. అయితే, విజయసాయి కామెంట్స్పై స్పందించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. విజయసాయి పార్లమెంట్లో మోడీ కాళ్లపై పడతారని, బయటకు వచ్చి సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారని ఆరోపించారు. మోడీ కాళ్లపై పడలేదన్న విషయాన్ని గుండెపై చేయి వేసుకుని చెప్పాలని విజయసాయికి సీఎం రమేష్ సవాల్ విసిరారు.