తమిళనాడుకు చెందిన అనుకృతివాస్ ఫెమినా మిస్ ఇండియా- 2018 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 29 మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టి, ఆమె ఈ ఘనత దక్కించుకున్నారు.నిన్న రాత్రి ముంబై డోమ్లోని ‘ఎన్ఎస్సీఐ ఎస్వీపీ’ స్టేడియంలో జరిగిన ‘మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే’లో 30 మంది ఫైనలిస్ట్లు పాల్గొనగా...తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్ ఈ ఏడాది ‘మిస్ ఇండియా’గా ఎన్నికైంది. గతేడాది ‘మిస్ వరల్డ్’గా ఎన్నికైన మానుషి చిల్లర్, అనుకృతికి కిరీటం ధరింపచేసింది. కాగా ‘మిస్ ఇండియా - 2018’ పోటీలో మొదటి రన్నరప్గా ‘మిస్ ఇండియా హరియానా’కు చెందిన మీనాక్షి చౌదరీ నిలవగా...రెండో రన్నరప్గా ‘మిస్ ఇండియా’ ఆంధ్రపదేశ్కు చెందిన శ్రేయా రావ్ కామవరపు నిలిచింది. ప్రస్తుతం అనుకృతి వాస్ ‘మిస్ వరల్డ్ - 2018’ కోసం సిద్ధమవుతుంది.