పొడుస్తున్న పొద్దుమీద అంటూ తెలంగాణ ఉద్యమాన్ని తన పాటతో శిఖరాగ్రానికి తీసుకు వెళ్లిన ప్రజా గాయకుడు, యుద్దనౌక గద్దర్. పోడుస్తున్న పాట విన్న ప్రతిఒక్కరిలో రక్తం ఉరుకలైపారింది. నేడు సోనియా రాకతో మేడ్చల్ మొత్తం కాంగ్రెస్ మాయంగా మారింది. కాంగ్రెస్ సభకు జనసంద్రోహాంగా తరలివచ్చారు. సభ ప్రాంగణం మేత్తం కాంగ్రెస్ కార్యకర్తలతో కోలహాలంగా మారింది. ఈ సందర్భంలో ప్రజాయుద్దనౌక సభ ప్రాంగణం ఎక్కి ప్రసంగంతోనే పొడుస్తున్న పొద్దు పాట మొదలు పెట్టాడు దింతో ఒక్కసారిగా సభ ప్రాంగణం ఈలలు, చప్పట్లతో సభను హోరెత్తించారు. కాలాన్ని బంధించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు.