టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : మమతా బెనర్జీ

Update: 2018-03-16 06:49 GMT

ఎన్డీయేతో టీడీపీ తెలగదెంపులు చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. టీడీపీ, ఎన్డీఏ నుంచి బయటకు రావడం మంచి పరిణామం అన్న మమతా..  కేంద్రంపై మరోసారి వరుస ట్వీట్లతో విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే.. విపత్తు నుంచి దేశాన్ని రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలను తలపిస్తున్నాయని మమతా అన్నారు. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత్వం, ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు ఏకం కావాలని తెలిపారు.

Similar News