అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చత్తీస్గఢ్లో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పాళి-తనఖర్ ఎమ్మెల్యే రామ్దయాళ్ యూకె నేడు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.