హింసాత్మకంగా మారిన యూత్ కాంగ్రెస్ ర్యాలీ

Update: 2018-06-26 11:19 GMT

లక్నోలో యూత్ కాంగ్రెస్ చేపట్టిన సేవ్ ఇండియా కార్యక్రమం హింసాత్మకంగా మారింది. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. లక్నో పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఉత్తర ప్రదేశ్‌లో అనేక అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా నిరసించారు. బిజెపికి చెందిన మహిళా మంత్రులు కూడా అత్యాచారాల అంశాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. యోగీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్ నేతలపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. లాఠీలకు పనిచెప్పారు. కార్యకర్తలను చితకబాదారు. పోలీసుల దాడిలో ఓ కార్యకర్తకు తీవ్రంగా గాయాలయ్యాయి.

Similar News