లోక్‌సభ 27కి వాయిదా

Update: 2018-12-21 10:23 GMT

లోక్‌సభ ఈనెల 26 వరకు వాయిదా పడింది. వచ్చే క్రిస్మస్‌తో పాటు వరుస సెలవుల నేపథ్యంలో లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు స్వీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. మళ్లి తిరిగి 27నుండి ఎదవిధిగా సభా కార్యక్రమాలు ప్రారంభవుతాయని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వెల్లడించారు. అంతకుముందు సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అన్నాడీఎంకే సభ్యులు సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో సభను హోరేత్తించారు. మరోవపు రాజ్యసభలో ఆందోళనల పర్వం కొనసాగింది. దీంతో సభ సజావుగా జరిగేలా సభ్యులంతా సభకు సహకరించాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు కోరారు.

Similar News