ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు నందమూరి కుటుంబంపై ప్రేమ లేదని, వారి కుటుంబాన్ని పూర్తిగా రాజకీయాలకు దూరం చేసేందుకు కుట్ర పన్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఓడిపోయే కూకట్పల్లి సీటును నందమూరి సుహాసినికి కేటాయించారని అన్నారు. గురువారం కూకట్పల్లి నియోజకవర్గంలో చేపట్టిన రోడ్షోలో భాగంగా కేపీహెచ్బీకాలనీ బస్టాప్ సెంటర్లో ఆయన మాట్లాడారు. రాజకీయాలంటే తెలియని సుహాసినిని కూకట్పల్లిలో నిలబెట్టారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. నందమూరి కుటుంబంపై చంద్రబాబుకు నిజంగానే ప్రేమ ఉంటే ఆయన కుమారుడు లోకేశ్ను చేసినట్లు ఆమెను కూడా ఏపీలో డైరెక్ట్గా మంత్రిని చేయొచ్చు కదా? లోకేశ్నే కూకట్పల్లిలో పోటీకి దించొచ్చు కదా అని నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వచ్చివెళ్లిన చంద్రబాబుకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలనగానే తెలంగాణ గుర్తుకొచ్చిందని విమర్శిం చారు. ఇక్కడివారంతా తెలంగాణ బిడ్డలేనని, ప్రాంతా లు, రాష్ర్టాలు, కులాలు, మతాలకతీతంగా అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని తెలిపారు.