పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన తొలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు.. పంచాయతీ ఎన్నికలు, ఓటరు నమోదు కార్యక్రమాలపై చర్చించారు. ఈనెల 17న ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. రెండు సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ సమావేశంలో నిర్ణయించారు. మార్చి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలకు జనరల్ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలను నియామించనున్నట్లు ఆయన తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ను తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.