తాజాగా తెలంగాణ సిఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన నడిపిస్తూనే జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని వెల్లడించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి కేటిఆర్ను వచ్చే ఏడాది మే లేదా జూన్లో మీట్ ది ప్రెస్కు ముఖ్యమంత్రిగా ఏమైనా కేటీఆర్ రాబోతున్నారా అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా దానికి కెటిఆర్ స్పందిస్తూ అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు.