ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ కకావికలమైంది. ఇప్పటికే 4వందల మందికి పైగా మృతి చెందారు. 3లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న వారిలో ఇప్పటి 3వేల మందిని రక్షించాయ్ ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ, నేవీ బృందాలు. 80 డ్యామ్లకు భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో 14 జిల్లాలుంటే 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఆగస్టు 8వ తేదీ నుంచి వర్షాలు దంచి కొడుతుండటంతో కేరల జలవిలయంలో చిక్కుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయ్ సహాయక బృందాలు. 2వేల 94 క్యాంపులు ఏర్పాటు చేసి మూడున్నర లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. పతనంతిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్, కొచ్చి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. శుక్రవారం ఒక్క రోజే వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 82వేల మందిని సహాయక బృందాలు రక్షించాయ్.
ఎన్డీఆర్ఎఫ్ 20 హెలికాఫ్టర్లతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నేవీ, ఐటీబీపీ బృందాలకు స్థానిక మత్స్యకారులు తమ బోట్లతో సహాకారం అందిస్తున్నారు. 40వేల మంది పోలీసులు, 3వేల 2వందల మంది ఫైర్ ఫైటర్స్, 18 ప్రత్యేక బృందాలు, 28 కోస్ట్ గార్డ్ టీంలు, 39 ఎన్డీఆర్ఎఫ్, 46 నేవీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయ్. ఇప్పటికే కేరళ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా వీక్షించనున్నారు.
వర్షాలు, వరదల దెబ్బకు కేరళ వాసులు వణికిపోతున్నారు. జలవిలయానికి తోడు ప్రకృతి ప్రకోపించడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు చేరడంతో లక్షలాది మంది కట్టు బట్టలతో నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎర్రాకులం, త్రిసూర్ క్యాంపుల్లోనే 50వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే కొచ్చి ఏయిర్ పోర్ట్ను మూసేశారు.
కేరళ రాష్ట్రాలను ఆదుకునేందుకు పలు రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ 25 కోట్లు, ఏపీ సర్కార్ 10 కోట్ల రూపాయలు వరదసాయంగా ప్రకటించాయ్. అంతేకాకుండా పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఫుడ్ ప్యాకెట్లను కేరళకు పంపించాయి. టాలీవుడ్, శాండల్వుడ్, కోలివుడ్ హీరోలు విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు.