రేపటి నుంచి యాగాలు చేయనున్న కేసీఆర్..

Update: 2018-11-17 13:57 GMT

తిరిగి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టాలని, ఘనమైన మేజరీటీ రావాలని, రాజయోగం రావాలని రేపటి నుంచి కేసీఆర్ యాగాలు చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల పాటు రాజా శ్యామల చండీహోమం, చండీ సహిత రుద్ర హోమంను చేయనున్నారు. యాగ కార్యక్రమాలల్లో భాగంగా ఇప్పటికే, ఎర్రవెల్లి గ్రామస్థులు గ్రామ దేవతలకు పూజలు చేశారు. రేపు ఉదయం నుండి కెసిఆర్ దంపతులు పూజలు నిర్వహించనున్నారు.
 

Similar News