క్లైమాక్స్‌కి చేరిన కర్ణాటక రాజకీయం

Update: 2018-05-19 07:40 GMT

క్షణానికో మలుపు తిరుగుతోన్న కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు చేరుకున్న ఎమ్మెల్యేలు ఉదయం  11 గంటలకు  ప్రారంభమైన 15 వ శాసన సభ తొలి సమావేశంలో సభ్యులు పాల్గొనున్నారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్‌ కేజీ బోపయ్య శాసనసభ్యులతో ప్రమాణం చేయించారు.

సాయంత్రం 4 గంటలకు జరిగే బలపరీక్షకు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. రహస్య ఓటింగ్‌ చేపట్టాలన్న వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించినందున సభ్యుల వారీగా ప్రభుత్వానికి అనుకూలురు, వ్యతిరేకులను లెక్కిస్తారు. ఈ ఓపెన్‌  బ్యాలెట్టు  బలనిరూపణలో ఎవరు నెగ్గారనే విషయం తేలిపోతుంది. దీంతో గెలిచిన పార్టీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది.

Similar News