ఒక్క ట్వీట్తో ఓ వ్యక్తి జీవితంపై మళ్లీ ఆశలు చిగురించేలా చేసింది. ఒక్కట్వీట్తో మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. సోషల్ నెట్ వర్క్ ట్వీట్టర్ ద్వారా కవిత సాయంకోరిన ఓ వ్యక్తి వెంటనే స్పందించి పూర్తి వివరాలు పంపాల్సిందిగా కవిత సూచించారు. ఇక వివరాల్లోకి వెళితే జితేందర్ రెడ్డి అనే నెటిజన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. అయితే తన స్నేహితుని గురించి ఎలాగైనా ఎంపీ వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నా స్నేహితుడిది చాలా పేద కుటుంబం, బైక్ యాక్సిండెట్ జరగడంతో అతను ఇప్పుడు కరీంనగర్లోని భద్రకాళి దవాఖనాలో ప్రాణప్రాయ స్థితిలో ఉన్నారు. అక్క నా స్నేహితుకునికి మీరు ఎమైనా సహాయం చేయగలరా’ అంటూ ట్విటర్లో కవితను ట్యాగ్ చేశారు. జితేందర్ ట్వీట్పై వెంటనే కవిత స్పందిస్తూ అతని పూర్తి వివరాలను 8985699999 ఫోన్ నెంబర్కు తెలియజేయాలని కవిత సూచించారు. ఇక దింతో ఎంపీ కవితకు చాలా మంది ట్వీట్టర్లో కవితకు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో కవితకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.