వాణిజ్య రాజధాని ముంబైలో రాకాసి జెల్లీఫిష్లు కలకలం రేపుతున్నాయి. విషపూరిత బాటిల్ జెల్లీఫిష్లు సంచరిస్తుండటంతో బీచ్లో సంచరించేందుకు ప్రజలు వణికిపోతున్నారు. జూహూ బీచ్లో గత రెండు రోజుల్లో 150 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. దీంతో బీచ్లో ఎక్కడ చూసినా అలర్ట్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరోవైపు విష ప్రభావం పని చేయకుండా కాళ్లకు నిమ్మకాయ రాస్తుకుంటున్నారు.