ప్రతిపక్షాలపై పంచ్లతో విరుచుకుపడుతూ సొంత పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా మాట్లాడే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో చేపట్టిన కరువు సీమలో సీఎం చంద్రబాబుతో పాటు సొంత పార్టీ నేతలపై తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి దీక్షలతో ఎలాంటి ఫలితం ఉండదని తాను ఎప్పుడో చంద్రబాబుకు చెప్పానన్నారు. ఈ విషయం తనకు కూడా తెలుసని చంద్రబాబు చెప్పారంటూ సభా వేదికపైనే చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం రాష్ట్రానికి ఒక్క బెల్లం ముక్క కూడా రాదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఆకార పుష్టి నైవేద్య నెష్టిలా ఉన్నారంటూ కామెంట్స్ చేశారు.