ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలిచి, కూటమి ఓటమి పాలైన సంగతి తెలిసిందే కాగా మహాకూటమి విడిపోతుందని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ విషయంపై జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రజాఫ్రంట్ విడిపోలేదని కోదండరాం స్పష్టం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ ప్రజాఫ్రంట్గానే పోటీ చేసేందుకు సరైన సరైన వ్యూహాలను సిద్ధం చేయాల్సి ఉందని కోదండరాం బుధవారం పీటీఐతో (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) పేర్కోన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ ఓటమిపై కోదండరాం మాట్లాడుతూ ప్రజాఫ్రంట్ ఏర్పాటులో ఆలస్యం కారణంగా ఎన్నికల ప్రచారానికి ఎక్కువగా సమయం దొరకలేదని స్పష్టం చేశారు.