లోయలో పడిన జవాన్ల బస్సు: ఒకరి మృతి

Update: 2018-12-24 06:40 GMT

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐటీబీపీ జవాన్లు వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒక జవాన్ చనిపోగా మరో 24 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డవారిని హెలికాప్టర్స్‌లో జమ్మూకు తరలించారు. రంబన్ జిల్లా ఖూనీనాలా సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
 

Similar News