ఐపీఎల్ వేలం: హనుమ విహారి జాక్‌పాట్‌

Update: 2018-12-18 10:46 GMT

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ ఆటగాళ్ల వేలం ఈరోజు జైపూర్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం ప్రారంభమైంది. 13దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు. ఈసారి వేలం ప్రక్రియను హ్యూస్ ఎడ్ మెయిడాస్ నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా నిలకడగా రాణిస్తున్న హనుమ విహారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. కనీస ధర రూ.50లక్షలతో వేలంలో పాల్గొన్న ఆల్‌రౌండర్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా ఆఖరికి రూ.2కోట్లకు విహారిని ఢిల్లీ దక్కించుకుంది.

Similar News