ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఆతిథ్య జట్టుతో హోరాహోరీగా పోరాడి విజయం సోంతం చేసుకుంది భారత్. అయితే రెండో టెస్ట్ రేపు ప్రారంభం కానున్న నేపథ్యం భారత్కు భారీ షాక్ తగింది. పెర్త్ వేదికగా జరిగే ఈ టెస్టుకు గాయం కారణంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బ్యాట్స్మన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే కాగా గాయంతో తొలి టెస్టుకు దూరమైన ఓపెనర్ పృథ్వీషా ఇంకా కోలుకోనేలేదు. దింతో వీరి స్థానాన్ని హునుమ విహారీ, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేశారు. పొత్తి కడుపులో నొప్పితో స్పిన్నర్ అశ్విన్, వెన్నునొప్పి కారణంగా రోహిత్ శర్మ రెండో టెస్టులో ఆడట్లేదు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.