అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చట్టమైనా చేయాలని లేకపోతే ఆర్డినెన్స్ అయినా తీసుకురావాలని అఖిల భారతీయ సంత్ సమ్మేళనం కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీలో జరిగిన సంత్ సమ్మేళనం సదస్సులో సుమారు 3 వేలకు పైగా సాధువులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి కేంద్రం ఇంకా తీర్మానం చేయకపోవడం బాధించిందన్న సంత్లు గాయ్, గంగా, గోవింద్ను రక్షించే వారికే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.