ముంబై ప్రమాదంపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు

Update: 2017-12-29 12:40 GMT

ముంబై రెస్టారెంట్‌‌లో అగ్ని ప్రమాదంపై బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తమ కర్తవ్యం నిర్వహించడం లేదనేది ఇక్కడ అంశం కాదని, వాళ్ళు చాలా గొప్పగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కానీ, ముంబయిలో విపరీతంగా జనాభా ఉంది. ముంబయి ముగిశాక మరోనగరం ప్రారంభం కావాలి. అంతేగానీ, ఈ నగరంలో ఇంకా విస్తరిస్తూనే ఉంది.. నియంత్రణ లేకుండా పోతోంది. ప్రతి నగరానికి జనాభా విషయంలో కొంత పరిమితి అంటూ ఉండాలి. పరిమితి దాటాక ఎవరినీ అనుమతించకూడదు. వారిని వేరే నగరానికి వెళ్లిపోనివ్వాలి... అక్కడ నుంచి మరో నగరానికి వెళ్లనివ్వాలి' అని హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 

Similar News