కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్ష ఇవాళ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభం కానున్న విధాన సభలో కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనుండగా.. స్పీకర్ పదవికోసం కాంగ్రెస్, జేడీఎస్ పోటీపడుతుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. అయితే, కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ల కూటమి బల పరీక్ష జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.