బాబును నమ్ముకుని ఏపీ రైతులు రోడ్డునపడ్డారు

Update: 2018-11-29 06:19 GMT

అది ప్రజాకూటమి కాదు.. దగా కూటమి అని మండిపడ్డారు టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన 2004,2009లో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. అలాగే, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్న చంద్రబాబు కనీసం వడ్డీలు కూడా కట్టలేదన్నారు. బాబును నమ్ముకుని రైతులు రోడ్డునపడ్డారన్నారు. ఇప్పుడు కొత్తగా వీళ్ల మేనిఫెస్టోను ఎవరు నమ్ముతారని హరీశ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టీడీపీ ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 

Similar News