ప్రేమికుల రోజున ఒక్కటైన గొర్రెలు

Update: 2018-02-14 12:02 GMT

ప్రేమికుల రోజున ఆ ప్రేమ జంట ఒక్కటయ్యింది. పెద్దల సాక్షిగా మనువాడారు. అయితే ఆ అమర ప్రేమికులు మనుషులు అనుకుంటే పొరపాటే, అవి గొర్రెలు.  అవునండి.. ప్రేమికులకు మద్దతుగా కర్ణాటక రక్షణ వేదిక నిర్వాహకులు.. రెండు గొర్రెలకు పెళ్లి చేసి వార్తల్లో నిలిచారు. సన్నాయి, వాయిద్యాల మధ్య గొర్రెలకు ఘనంగా పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా కర్ణాటక రక్షణ వేదిక నిర్వాహకులు మాట్లాడుతూ.. వాలంటైన్స్ డేను తాము వ్యతిరేకించడం లేదన్నారు. ప్రేమికుల రోజుకు మద్దతుగానే గొర్రెలకు పెళ్లి చేశామని తెలిపారు. ప్రేమకు కులం, మతం అడ్డురాదని స్పష్టం చేశారు. ప్రేమికుల రోజున కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న వారికి కర్ణాటక ప్రభుత్వం.. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఆర్థిక సాయం చేయాలని కర్ణాటక రక్షణ వేదిక నిర్వాహకులు డిమాండ్ చేశారు.
 

Similar News