ఐపీఎల్ 11 సీజన్ లో ధోని సారధ్యంలోని చెన్నై జట్టు విజయం పట్ల పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జట్టు విజయంలో చెన్నై రధసారధి ధోని కీలకపాత్ర పోషించాడని అన్నాడు గౌతమ్ గంభీర్. ధోని సారధ్యంలోని చెన్నై జట్టు కచ్చితంగా గెలుస్తుందని తనకు ముందే తెలుసనీ అన్నాడు. csk యాజమాన్యం ధోనికి పూర్తి స్వేచ్ ఇచ్చిందని, తద్వారా ఒత్తిడిని తగ్గించి విజయాల్ని తమ ఖాతాలో వేసుకుంటుందని పేర్కొన్నాడు. ఈ కారణంగానే ఆ జట్టు ఏడుసార్లు ఫైనల్కు చేరడమే కాకుండా మూడుసార్లు విజేతగా నిలిచిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.