నిలిపివున్న రైల్లో మంటలు..

Update: 2018-05-29 12:56 GMT

నిలిపి ఉన్న రైల్లో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు  ఎగిసిపడటంతో సిబ్బంది ఆందోళన చెందారు. ఈ ఘటన ముంబైలోని షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. మంగళవారం ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వే యార్డులో నిలిపివున్న షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగి నుంచి పెద్ద ఎత్తున మంటలతో పొగ బయటకు రావడంతో అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అభిప్రాయపడుతున్నారు. 

Similar News