ప్రభుత్వ ఉద్యోగులు, సర్కార్ వేర్వేరు కాదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపామన్న ఈటల....తమది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఈటల....సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. పీఆర్సీ, బదిలీలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.