దేశ వ్యాప్తంగా నాలుగు లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా- గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే యూపీ, పంజాబ్, బిహార్, కేరళ, మహారాష్ట్ర, అంపటి మేఘాలయ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్,జార్ఖండ్ పరిధిలోని 10 శాసనసభ స్ధానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ జరగుతోంది. ఈ నెల 31 ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.