ఢిల్లీలో మూతపడ్డ పెట్రోల్ బంకులు

Update: 2018-10-22 05:43 GMT

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఈ ఉదయం నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు క్రయ విక్రయాలు నిలిపి వేయాలని ఢిల్లీ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించింది. దీనికనుగుణంగా పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. కానీ ఢిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కారు మాత్రం వ్యాట్‌ను తగ్గించకపోవడంతో బంకులను మూసేయ్యాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండు రోజుల పాటు నగరంలోని మొత్తం 400 బంకుల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విక్రయాలు నిలిచిపోనున్నాయి. 

Similar News