మాతో పొత్తు పెట్టుకుంటే.. జగన్ జైలుకే

Update: 2018-01-20 13:05 GMT

కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మోదీ మెప్పు కోసమే ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ సీఈసీ సిఫారసు చేసిందని విమర్శించారు. ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలనుకుంటే ఏపీ, తెలంగాణలో పార్టీలు ఫిరాయించి మంత్రులుగా వున్నవారు చాలా మంది ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఐని విధానాలను కూడా తప్పుపట్టిన ఆయన.. కేంద్రానికి పెంపుడు కుక్కల సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన నారాయణ.. విభజన హామీల సాధనకు చంద్రబాబు కోర్టుకెళ్తాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కమ్యూనిస్టులతో వైసీపీ పొత్తు పెట్టుకుంటే జగన్ జైలుకెళ్లడం ఖాయం అని వ్యాఖ్యానించారు.

Similar News