కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను,13 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే విడుదలైన మూడో జాబితాలో మాజీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. రేవంత్ వర్గానికి చెందిన అరికెల నర్సారెడ్డిని, సుభాష్ రెడ్డిలకు నిజామాబాద్, కామారెడ్డిలో రెండు సీట్లు కేటాయించాలని రేవంత్ పట్టుబట్టిన ఆ సీట్లను సీనియర్ నేతలు ఎల్లారెడ్డి- జాజల సురేందర్, నిజామాబాద్ రూరల్ నుంచి రేకుల భూపతిరెడ్డిలకు కట్టబెట్టింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కనేలేదు. అయిన టీఆర్ఎస్, కాంగ్రెస్ల అభ్యర్థుల మధ్యే హోరాహోరీ పోటీ నెలకొంది.