2018ఎన్నికల రణక్షేత్రంలో హోరాహోరిగా నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జోస్యం చెప్పారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ . ఈనెల డిసెంబర్ 11న ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కెసిఆర్ ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రచారసభలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కెసిఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. దళితుడిని సిఎం చేస్తానన్న మాట మరిచారని, కేబినేట్లో మహిళలకు స్థానమే కల్పించలేదని, మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. చంద్రశేఖర్ రావు కో హఠావో..తెలంగాణ కో బచావో అని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.