తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్గిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించబోతున్నదని ఎగ్జిట్స్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. సీఎన్ఎన్ వెల్లడించిన సర్వే ప్రకారం తెలంగాణలో తిరిగి అధికారం చేపట్టబోయేది టీఆర్ఎస్సే. మొత్తం 110 స్థానాలకు గాను టీఆర్ఎస్కు 50 నుంచి 65 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక, టీఆర్ఎస్కు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన ప్రజాకూటమికి 38 నుంచి 52 సీట్లు రానున్నట్టు పేర్కొంది. బీజేపీకి 4 నుంచి ఏడు స్థానాలు వస్తాయని, ఇతరులకు 8 నుంచి 14 స్థానాలు వస్తాయని పేర్కొంది.