సీఎం కేసీఆర్ ఇంట విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోదరి లీలమ్మ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ తన సోదరి మరణవార్త విని హుటాహుటిన హైదరాబాద్కు బయలు దేరారు.