‘విజయం ఎంత ఘనంగా ఉందో, బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది’

Update: 2018-12-11 11:48 GMT


తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి కారకులైన తెలంగాణ ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. గెలుపుతో అహంకారం రావొద్దని, ప్రజల తీర్పు మేరకు కర్తవ్య నిష్ఠతో పని చేయాలని సూచించారు. విజయం ఎంత ఘనంగా ఉందో, బాధ్యత కూడా అంత బరువుగా ఉందని అన్నారు. సమయం వృథా కాకుండా కష్టించి పనిచేయాలని, ప్రజల ఆకాంక్ష మేరకు కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతామని అన్నారు.

Similar News